Thursday, May 2, 2024

TS : రేపు యాదాద్రికి సీఎం రేవంత్‌రెడ్డి…

రేపు సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రిలో ప‌ర్య‌టించ‌నున్నారు. రేపటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేప‌థ్యంలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

సీఎంతో పాటుగా ఆరుగురు మంత్రులు కూడా యాదాద్రికి వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వస్తి పూజలలో సీఎం, మంత్రలు పాల్గొననున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం యాదాద్రి నుండి నేరుగా భద్రాచలం వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి రేవంత్ యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement