Thursday, May 2, 2024

TS : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ‌ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరుగుతుంది.మద్దూరు మండలం తిమ్మాజీ పల్లి గ్రామంలో బావాజీ జాతర కు సీఎం హాజరవుతారు.

- Advertisement -

సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండల కేంద్రంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంనిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. కాగా రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నాగర్‌కర్నూల్‌ జిల్లాకు వస్తున్న రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్లమెంట్‌ నియోకజవర్గంలోని ఐదుగురు ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యారు. సన్నిహితుడైన మల్లురవి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్న ఆయన సెంటిమెంట్‌ ప్రకారం బిజినేపల్లి బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అందుకోసం బిజినేపల్లి నుంచి వనపర్తి వెళ్లే రోడ్డు పక్కన 12 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. ఎస్పీతోపాటు దాదాపు వెయ్యి మంది పోలీస్‌ ఉన్నతాధికారులు సీఎం భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

తిమ్మారెడ్డిపల్లిలో జరిగే బావోజీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని గిరిజనుల ఆరాధ్య దైవమైన గురులోక మాసంత్‌ (బావోజీ)ని సీఎం దర్శించుకోవడానికి రానున్న సందర్భంగా ఎలాంటీ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవకుండా 500 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తుకు చర్యలు చేప‌ట్ట‌నున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌, వికారా బాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు ఇచ్చారు. 10 సెక్టార్లుగా విభజించి రూట్‌ మ్యాప్‌ ఆధారంగా మద్దూర్‌ నుంచి తిమ్మా రెడ్డిపల్లి జాతర వరకు బందో బస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేటాయించిన ప్రదేశాల్లో సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement