Saturday, May 4, 2024

AP : ఇవాళ సీఎం జ‌గ‌న్ మేమంతా సిద్ధం బ‌స్సుయాత్ర పునఃప్రారంభం…

సీఎం జ‌గ‌న్ మేమంతా సిద్ధం బ‌స్సు యాత్రం ఇవాళ పునః ప్రారంభించ‌నున్నారు. సోమ‌వారం విరామం తీసుకోగా నేడు ఉదయం గంటలక ఎండాడ ఎంవీవీ సిటీ రాత్రి బస నుంచి ప్రారంభం కానుంది. అక్క‌డి నుంచి మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు.

- Advertisement -

జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది వైసీపీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement