Sunday, April 28, 2024

TS: కరాచీ బేకరీ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్ లోని గగన్ పహాడ్ లో ఉన్న కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 15మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

గ్యాస్ లీకైన సమయంలో 40మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఆర్డీఓ అపోలోకు క్షతగాత్రులను పంపించాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement