Monday, April 29, 2024

ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల వ్రతంమార్గశిర లక్ష్మీవార వ్రతం

శ్రీమహావిష్ణువు అత్యంత ప్రీతికరమైన మార్గశిరమాసంలో వచ్చే లక్ష్మీవారం (గురువారం)నాడు శ్రీమహాలక్ష్మికి చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. మార్గశిరమాసంలో గురువారాలలోఈ పూజను చేయడం సర్వశ్రేష్ట ము. ఈ వ్రతంను ఆచరించడం వల్ల ఋణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. ఈ వ్రతాన్ని అయిదు గురువారాలు చేయాలి. మార్గశిరమాసంలో నాలుగు వారాలు వస్తే అయిదవ వారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం చేయాలి. అదే ఈ పూజలో విశేషం. అయితే ఈ సంవత్సరం మార్గశిర మాసంలోనే అయిదు వారాలు వచ్చాయి. డిసెం బర్‌ 14వ తేదీ గురువారం, 21వ తేదీ గురువారం, 2024 జనవరి 3వ తేదీ గురువారం, జనవరి 11వ తేదీ గురువారం. ఇలా అయిదువారాలు రావడం శ్రేష్ఠ ప్రదం.
వ్రత విధానం

మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలు ఈ వ్రతం చేసుకోవాలి. ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. (తలంటు కుంకుడు/ షాంపూలతో చేయకూడదు.) తలకు నూనె రాసుకోవడం, దువ్వుకోవడం చేయకూడదు. ప్రత్యేకించి పూజ ముగిసేవరకు అయినా పాటించాలి. చక్కగా అలంకరించిన లక్ష్మీ అమ్మవారి చిత్రపటము లేదా చిన్న విగ్రహాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయాలి. గణపతి పూజ అనంతరం లక్ష్మీదేవికి అధాంగ, షోడశోపచార, అష్టోత్తర శతనామా వళితో పూజ చేయాలి. లక్ష్మీ అమ్మవారికి ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి. ఏ లోపము లేకుం డా వ్రతం చేసుకోవాలి.

అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు

1వ గురువారం – పులగం, 2 వ గురువాం – అట్లు, తిమ్మనం
3వ గురువారం- అప్పాలు, పరమాన్నము, 4వ గురువారం – చిత్రాన్నం, గారెలు
5వ గురువారం – పూర్ణం బూరెలు
ఈ వ్రతము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపా రు. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలో కంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారూ ఇళ్ళను గోమయం (ఆవుపేడ)తో అలికి, ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి, కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. నాలుగు వర్ణాలవారు కలిసి ఒకచోట చేరి, లక్ష్మీ దేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా, వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మ#హ ర్షితో ”మునివర్యా! ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూ#హలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియ పరచండి” అన్నారు.
గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గ శిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది” అని పరాశర మ#హర్షి నారదుడికి తెలిపారు. నారదుడు ”మ#హనీయ, ఈ పూజను ఇంతకుముందు ఎవరై నా చేశారా? చేస్తే ఎవరు చేశారో, వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి” అనగా, పరా శరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు.
ఒక లక్ష్మీవారం రోజున శ్రీమహాలక్ష్మీదేవి విష్ణు పాదాలను సేవిస్తూ ఉంది. మహాలక్ష్మీ దేవి స్వామితో ”స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమ తిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్ర#హస్తాను” అని పలికింది. విష్ణుమూ ర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్ర#హ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటిముందుకు వచ్చి ”అవ్వా! ఈ రోజు మార్గశిర గురువా రం లక్ష్మీపూజ. ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి?” అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ ”అమ్మా! ఆ వ్రతం ఏమిటి? ఎలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను” అని అడుగుతుంది. మహా లక్ష్మీ మందహాసంతో ఈవిధంగా పలికింది.
”మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి, ఇల్లు గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, లక్ష్మీ దేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధరకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని, దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి, పసుపునీటితో కడిగిన పోకచెక్క (వక్క)ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని, కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి, ఎర్రని పూలతో పూజించి శ్రీమహాల క్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా, నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం”. లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. ”రెండవ విధా నం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీకటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని, పదిమందిని పిలిచి ఈ వ్రతం చేయాలి, పసుపుకుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement