Friday, May 3, 2024

ఉప్ప‌ల్ – నార‌ప‌ల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులపై సీఎం సమీక్ష…

మేడిపల్లి, జూలై 24(ప్రభన్యూస్) : ఉప్పల్ – నారపల్లి ఎలివేటడ్ కారిడార్ ప్రాజెక్ట్ పనుల నిర్లక్ష్యం పై సోమవారం మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సచివాలయంలో వినతి పత్రం అందజేశారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి, అధికారులుతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానం పై తీవ్రంగా మండిపడ్డారు.

రెండేళ్ల లో పూర్తి కావలసిన ప్రాజెక్టు ఐదేళ్లుగా కొనసాగుతున్న 40 శాతం పనులు కాలేకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం బీటీ రోడ్డు వేయాల‌ని…ఆర్ అండ్ బీ మినిస్టర్ వేము ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారుతక్షణమే ప‌నులు ప్రారంభించాల‌ని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రి మ‌ల్లారెడ్డి..పీర్జాదిగూడ మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement