Friday, May 10, 2024

Breaking | మెద‌క్‌ బీఆర్ ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో (ప్ర‌భ న్యూస్‌): మెద‌క్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ ఎస్ పార్టీ ఆఫీసును ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డి త‌దిత‌రులున్నారు. కాగా, పూజారులు ఆయ‌న‌ను స్వాగ‌తించి ఆశీర్వ‌చ‌నాలు అందించారు. జిల్లా పార్టీ ఆఫీసు ప్రారంభం సంద‌ర్భంగా జిల్లా పార్టీ అధ్య‌క్షురాలు ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డిని ఆశీర్వ‌దించారు.

ఇక‌.. హైదరాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ నుంచి మొదక్‌ పర్యటనకు వెళ్తున్న‌ సీఎం కేసీఆర్‌కు దారి పొడవునా జననీరాజనాలు పలుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు వస్తే పటాన్‌చెరు ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. ప్రజలందరూ మళ్లీ బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

కాగా, దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్‌ సొమ్ము పంపిణీకి బుధవారం సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ రెండింటి ప్రారంభంతో మరో చారిత్రక ఘట్టానికి మెదక్‌ పట్టణం వేదిక కానున్నది. మెదక్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, జిల్లా పోలీస్‌ ఆఫీస్ ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం మెదక్‌ సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement