Friday, May 3, 2024

నేడు జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

ప్రభుత్వ పథకాలపై తెలంగాణ భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇవాళ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో వివిధ ప‌థ‌కాల అమ‌లు, వ్యవసాయంతో పాటు ద‌ళిత బంధు పథకం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. వ‌రికి ప్రత్యామ్నాయ పంట‌ల సాగు పై కూడా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. ఈ రోజు స‌మావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు స‌మాచారం. ముఖ్యంగా ద‌ళిత బంధు పై సుదీర్ఘంగా చ‌ర్చించే అవ‌కాశముంది. అలాగే ద‌ళిత‌బంధుపై క‌లెక్ట‌ర్ల‌కు సూచ‌న‌లు చేయ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement