Saturday, May 4, 2024

చెట్టును ఢీ కొట్టిన కారు : ముగ్గురు మృతి :ఒక‌రి ప‌రిస్థితి విష‌మం

గచ్చిబౌలి లో తెల్లవారు జామున రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో చెట్టును ఢీ కొట్టింది. అమీర్ పేట్ లోని ఓ హాస్టల్ లో ఉంటున్న అబ్దుల్ రహీం(25),ఎమ్. మాన‌స‌(19),ఎన్ మాన‌స‌(23)మృతి చెందారు. అబ్దుల్ రహీం బ్యాంక్ ఉద్యోగి,కాగా మాన‌స‌లు ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ గా పోలీసులు గుర్తించారు..

వారితో పాటు డ్రైవర్ అబ్దులా మృతి చెందాడు. సిద్దు అనే మరో జూనియర్ ఆర్టిస్ట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ సిద్ధూను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement