Wednesday, April 24, 2024

తెలంగాణ‌లో ప‌డిపోతున్న ఉష్ణోగ్రత‌లు

రోజు రోజుకి ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. దాంతో చ‌లి బాగా పెరుగుతుంది. హైద‌రాబాద్ శేరిలింగంప‌ల్లి హెచ్ సియూ వ‌ద్ద 8.2డిగ్రీ ల క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్ లో చలి పెరుగుతోంది. మరో నాలుగైదు రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. ఇక సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 6.5 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 7.1 డిగ్రీలు, జహీరాబాద్ లో 7.3 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement