Sunday, April 28, 2024

ఢిల్లీలో కేసీఆర్ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. శనివారం పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఆదివారం కేంద్ర హోంశాఖ సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నారు.

కాగా, ఈ నెలలోనే కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనుండటం ఇది రెండోసారి. ఈ నెల 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కోసం వెళ్లిన కేసీఆర్.. దాదాపు వారం రోజుల పాటు హస్తినలోనే మకాం వేసారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి షెకావత్‌, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తదితరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను, సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తాజా మరోసారి మరోసారి కేసీఆర్ పర్యటిస్తుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఎందుకు ఇన్ని ఢిల్లీ వెళ్తున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండిః బైడెన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement