Saturday, May 4, 2024

TS | అక్టోబర్ 24 నుండి సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే!

తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా వచ్చే నెల 24వ తేదీ నుండి సీఎం కేసీఆర్ బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించనున్నది. దీంతో ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు.

మెనూ ఇదే!

సోమవారం – గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం – బియ్యం రవ్వ కిచిడి, చట్నీ
బుధవారం – బొంబాయి రవ్వ ఉప్మా, సాంబార్
గురువారం – రవ్వ పొంగల్, సాంబార్
శుక్రవారం – మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్
శనివారం – గోధుమ రవ్వ కిచిడి, సాంబార్

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ లోని మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. ఈ పథకం ప్రారంభంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement