Saturday, May 18, 2024

Christamas – అన్ని వర్గాల అభ్యున్నతే బిజెపి ధ్యేయం – ఎమ్మెల్యే ధన్పాల్

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)25:అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా బిజెపి పార్టీ కృషి చేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందూరులో కుల మతాలకతీతంగా అన్ని పండుగలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సోమవారం నిజామాబాదు నగరం లోని CSI చర్చి లో అర్బన్ శాసనసభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ పాల్గొ ని క్రిస్టియన్ సోదర, సోదరి మనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల కు అన్ని మతాలకు సమానంగా చూస్తుం దన్నారు.

కేంద్రం లో మోదీ ప్రభుత్వం సెక్కులర్ పార్టీ అన్నారు కరోనా, సమయం లో అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వాక్సిన్ ఇవ్వడం జరిగింద న్నారు. నగరన్ని అందరం కలసి కట్టుగా అభివృద్ధి చేసుకుందాం అన్నారు. దేశం లో ప్రధానమం త్రి నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టె పథకం లో అన్ని వర్గాల కు సమ న్యాయం జరుగుతుంద న్నారు, జన్ ధన్ పథకం నుంచి మొదలు పెడితే ఆయుష్మాన్ భారత్ పథకం వరకు ప్రతి పథకం అన్ని వర్గాల ప్రజలకు అందుతుందన్నారు. నాతో ఎటువంటి సహాయ సహకారం అవసరం ఉన్న మీకు అండగా ఉంటాను అని అన్నారు.

ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, జన్స్, జోసెఫ్, డేవిడ్, పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement