Sunday, April 28, 2024

TS : ఆటో ఢీకొని చిన్నారి మృతి..

కోరుట్లలో ఆటో ఢీకొని చిన్నారి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ కాల‌నీలో ఇవాళ‌ చోటుచేసుకుంది. ఇంటి ముందు 16 నెలల బాలుడు ఆడుకుంటుండ‌గా తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే ఆటో ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆ బాలుడు అక్క‌డిక్క‌డే మృతి చెందాడు.

- Advertisement -

స్థానిక ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన పొట్ట రిశీంద్ర -అపూర్వ దంపతుల కుమారుడైన సుధన్వన్ (16 నెలలు) శనివారం ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి బాలుడిని ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనతో కోరుట్లలో విషాద చాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement