Sunday, April 28, 2024

ADB: నిర్మల్ లో పర్యటించిన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి..

నిర్మల్ ప్రతినిధి, ఫిబ్రవరి 2 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి శుక్రవారం నిర్మల్ కు విచ్చేసిన సందర్భంగా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఉద్యోగులకు ఈనెల 1 తేదీన జీతాలు వచ్చినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పారు.

ఉద్యోగుల పెండింగ్ బిల్స్, ఇతర సమస్యలు సి.ఎస్ కు వివరించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారు. చీఫ్ సెక్రటరీని కలిసిన వారిలో అధ్యక్షులు వెల్మల ప్రభాకర్, కార్యదర్శి కుడాల రవికుమార్, ఉపాధ్యక్షులు జవాదు హుస్సేన్, నిర్మల్ టౌన్ కార్యదర్శి బి.శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ ఎస్.మోహన్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.అరుణ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement