Thursday, May 2, 2024

Chennur – బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత .. ప్రభుత్వ విప్ బాల్క సుమన్

న్చెన్నూర్ అక్టోబర్ 30(ప్రభ న్యూస్) బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తూ వారి కి చేయూతను అందిస్తూన్నామని చెన్నూరు నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ఆర్యవైశ్య, మర్వాడి కుల సంఘాల అధ్వర్యంలో వేరువేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల పాలనలో చెన్నూరు నియోజకవరర్గంలో కుల మతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు పారదర్శకంగా చేయూతను అందించామన్నారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కోట్లాది రూపాయలతో రోడ్లు, ఆసుపత్రి, మిని ట్యాంక్ బండ్ ల నిర్మాణం తో పాటు పార్క్ ఏర్పాటు చేశామన్నారు.

. పట్టణం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే నవంబర్ 30వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గత విపక్షాల పాలనలో జరిగిన అభివృద్ధి మీకు తెలియనిది కాదన్నారు మళ్ళీ ఎన్నికల్లో కల్లి బొల్లి మాటలతో వస్తున్నారని, వారి మాటల మాయలో పడి మోసానికి గురికావాద్దన్నరు. మూడు మండలాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు వ్యాపార కేంద్ర బిందువైన పట్టణని మరింత అభివృద్ది జరుగలంటే రాష్ట్రంలో మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి లా ప్రతి ఒక్క వ్యాపారవెర్త కృషి చేయాలన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం లో స్థానిక ఆర్యవైశ్య, మర్వాడీ వ్యాపార వేత్తలు మహిళలు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement