Monday, May 6, 2024

నగర శివారులో రెచ్చిపోయిన చెడ్డీగ్యాంగ్..

హైదరాబాద్ లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ అలజడి మొదలైంది. కీసర పిఎస్ పరిధి నాగారంలో మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు దుండగులు. మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి 16 తులాల బంగారం అపహరించినట్లు తెలుస్తోంది. సుమారు ఏడుగురు మంది దుండగులు అర్థరాత్రి సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్లకు తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్. అంతేకాదు తమ దొంగతనానికి ఎవరైనా అడ్డొస్తే దాడులకు తెగబడుతున్నారు. ఒంటికి‌ ఆయిల్ పూసుకుని‌ చెడ్డిలపై వీధుల వెంట తిరుగుతు అదనుగా ఉన్న ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారు. చెడ్డి గ్యాంగ్ నడక ప్రత్యేకంగా ఉంటుంది.. వీధుల్లో వీరు వంగి వంగి నడుస్తున్నట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది.. అంతేకాదు వారి నడక చూసి వీది కుక్కలే బయపడి పారిపోతున్న దృశ్యాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఘటనతో శివారు ఇళ్లలో వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు, అలారమ్ లు, తలుపులకు పటిష్టమైన గడియలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.

ఇది కూడా చదవండి: ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది: ఆదిమూలపు సురేశ్

Advertisement

తాజా వార్తలు

Advertisement