Friday, May 17, 2024

దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సుల్తానాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారాన్నారు.

పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతం ప్రజలు వివిధ పనుల్లో బయటకు వచ్చిన సందర్భంలో మంచినీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్, మున్సిపల్ చైర్మన్ సునీతా రమేష్, ఎంపీపీ బాలాజీ రావు, కమిటీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement