Sunday, April 28, 2024

Crime | పొలం ప‌నుల‌కు వెళ్తుంటే గొలుసు లాక్కెళ్లారు.. శంక‌ర్‌ప‌ల్లి మండ‌లంలో ఘ‌ట‌న‌

శంకర్‌పల్లి (ప్రభ న్యూస్): పొలం ప‌నుల‌కు వెళ్లుండ‌గా ఓ మ‌హిళ మెడ‌లో నుంచి చైన్ లాక్కెళ్లిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో జ‌రిగింది. శంకర్‌ప‌ల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని పొద్దుటూరు గేట్ నుండి పిలుగుండ్ల గ్రామానికి వెళ్లే ప్రధాన దారిలో ఇవ్వాల (శ‌నివారం సాయంత్రం) ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మొకిల పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన ధరణి బుచ్చమ్మ, భర్త ధరణి గోపాల్ పొలం పనుల కోసం మెయిన్ రోడ్డు) లో వెళుతూ ఉంటే వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగ ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల పుస్తెలతాడును లాక్కొని వెళ్ళాడు.

ఈ క్ర‌మంలో ఆమె మెడకు గాయం అయ్యింది. ఈ ఘటన నుంచి తేరుకొనే లోపే దొంగ పారిపోయాడు. దీంతో వారు మోకిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ (క్రైమ్) నరసింహారెడ్డి, ఏసీపీ రమణ గౌడ్, శంకర్పల్లి, నార్సింగ్, మోకిల, ఇన్‌స్పెక్ట‌ర్లు, సబ్ ఇన్‌స్పెక్ట‌ర్లు పరిశీలించారు. ఇన్‌స్పెక్ట‌ర్ నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement