Saturday, May 4, 2024

Celebrity Meet – రేపు రాజ‌మౌళి, ప్ర‌భాస్ ల‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటి..

హైద‌రాబాద్ – తెలంగాణలో వివిధ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనేందుకు రేపు సాయంత్రం కేంద్ర హోం మంత్రి హైద‌రాబాద్ కు రానున్నారు.. ఆయ‌న శంషాబాద్ లోని నోవాటెల్ హోట‌ల్లో బ‌స చేయ‌నున్నారు…అదే రోజు రాత్రి తెలుగు సినీ అగ్ర కథానాయకుడు ప్రభాస్ , స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

కాగా, వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను అమిత్‌షా కలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, మిథాలీ రాజ్ తదితరులను కలిశారు. ఇప్పుడు ప్రభాస్, రాజమౌళిలను కలవనున్నట్లు సమాచారం. జూన్‌ 16న ‘ఆది పురుష్‌’ విడుదలకానున్న నేపథ్యంలో ప్రభాస్‌ను అమిత్‌షా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ భేటీపై అటు ప్రభాస్‌-రాజమౌళి, ఇటు భాజపా వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక గురువారం నాడు ఉద‌యం శంషాబాద్‌లో పార్టీ కార్యకర్తలతో అల్పాహార సమావేశంలో పాల్గొంటారు. ఆ త‌ర్వాత భ‌ద్రాచ‌లం వెళ్లి అక్క‌డ భ‌ద్రాద్రి రామ‌య్య‌ను ద‌ర్శించుకుంటారు.. మహాజన్ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. అదే రోజు రాత్రి ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ‌తారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement