న్యూ ఢిల్లీ: గద్వాల నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈసీ లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్లో ప్రచురించాలని ఆదేశించింది. లేఖతోపాటు హైకోర్టు తీర్పు కాపీని జతపరిచింది. కాగా, జోగులాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా బి.కృష్ణమోహన్రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై కృష్ఱ మోహన్ రెడ్డి తీర్పుపై అప్పీల్ కు నేటి వరకూ వెళ్లకపోవడంతో సిఈసీ ఈ ఆదేశాలు ఇచ్చారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement