Sunday, May 19, 2024

కూచుకుల్ల , నాగంల‌ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు… బిఆర్ ఎస్ నేతల సెటైర్లు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (సెప్టెంబర్ 4) ప్రభ న్యూస్…నియోజకవర్గ ప్రజలు కూచుకుల్లను ఆరుసార్లు, నాగంను రెండుసార్లు తిరస్కరించినా ఇప్పటికీ సోయి రావడం లేదని బిఆర్ఎస్ నాయకులు జక్కా రఘనందన్ రెడ్డి బైకాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పదవుల కోసం ఒకరు , ఉనికి కోసం ఒకరు నీచ రాజకీయం చేస్తూ ప్రజలను ఇబ్బంది చేస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 6 బుధవారం తాడూరు మండలం నుంచి మర్రి 10 సంవత్సరాల ప్రజాప్రస్థానం రెండవ విడత యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిరణ్ జడ్పిటిసి శ్రీశైలం, మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సుబ్బారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, యరా రమేష్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement