Monday, April 29, 2024

TS : ఇవాళ సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్…..గ‌చ్చిబౌలి స్టేడియంలొ భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు హైదరాబాదులో ఇవాళ‌ సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా నిలవనుంది. హైటెక్ సిటీ సిల్వర్ జూబ్లీ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు కృతజ్ఞతగా ఈ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఈ కాన్సెర్ట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి లక్ష మంది వరకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో, గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టూ భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement