Thursday, May 9, 2024

Bear attack:ఎలుగుబంటి దాడి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎలుగుబంటి గిరిజ‌న రైతుపై దాడి చేసింది. ఎల్లారెడ్డిపేట మండలం గుంటుపల్లి చెరువు తండా గ్రామ పంచాయతీ కి చెందిన గుగులోత్ రవి నాయక్ (55)అనే గిరిజన రైతు పై ఎలుగుబంటి దాడికి పాల్ప‌డింది. దాడిలో రైతుకు తీవ్రంగా గాయాల‌య్యాయి.

విష‌యం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లా రెడ్డి పేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన రైతు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement