Saturday, April 27, 2024

క‌ర్ష‌క అమ‌ర‌వీరుల‌కు నివాళిగా క్యాండిల్ ప్రదర్శన

కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాల రద్దు కోసం 14 నెలల పాటు అలుపెరగని పోరాటం చేసి అమరత్వం పొందిన 700 మంది కర్షక అమర వీరులకు నివాళిగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ నుంచి ఇందిరమ్మ విగ్రహం వరకు క్యాండిల్ ప్రదర్శన నిర్వ‌హించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ నేత న‌ర్సారెడ్డి భూప‌తిరెడ్డి తెలిపారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కిసాన్ విజయ దివాస్ పేరున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని, ఈ ప్రదర్శన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లతోపాటు ముఖ్య నాయకులు పాల్గొని నివాళులర్పించడం జరుగుతుందన్నారు. కావున కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొని కర్షక అమర వీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటిద్దామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement