Saturday, April 20, 2024

టీఎస్ పీజి ఈసెట్ సెకండ్ ఫెజ్ కౌన్సిలింగ్..!

ప్ర‌భ‌న్యూస్: టీఎస్‌ పీజీ ఈసెట్‌-2021 సెకండ్‌, ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కొనసాగనుంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోని అభ్యర్థులు ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చేసుకుని సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు ఇప్పుడు నేరుగా వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు.

రెండో విడతలో పాల్గొనే అభ్యర్థులు 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. 30వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement