Wednesday, May 22, 2024

RR: క్రూరమృగం దాడిలో.. రెండు లేగదూడలు మృతి

నందిగామ, డిసెంబర్ 11 (ప్రభ న్యూస్): మొన్న కొత్తూరు, నిన్న నందిగామ మండలాల్లో క్రూర జంతువు సంచరించడంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. నందిగామ మండలం తాటిగడ్డ తండాలో ఆదివారం రాత్రి రెండు లేగదూడలపై క్రూరమృగం పంజా విసిరింది. అత్యంత పాశవిక దాడిలో మూగజీవాలు విలవిలలాడి అక్కడే ప్రాణం విడిచాయి.

క్రూర జంతువు దాడిలో మరికొన్ని మూగ జీవాలు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ఘోరకలితో చుట్టుపక్కల గ్రామాల రైతులు, గిరిజనులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులు సత్వరమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి స్థానికుల భయం తొలగించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement