Monday, April 29, 2024

BREAKING: గుండెపోటు వచ్చినా … ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్…

విధి నిర్వ‌హ‌ణ‌లో త‌న ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌కుండా ఓ బ‌స్సు డ్రైవ‌ర్ ప్ర‌యాణీకుల ప్రాణాల‌ను సుర‌క్షితం చేశాడు. త‌న‌కు ప్రాణ‌పాయం ఉంద‌ని తెలిసినా ప్ర‌యాణీకుల ప్రాణాలే ముఖ్య‌మ‌ని భావించాడు. ఆకస్మికంగా గుండెపోటు వచ్చినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవరు వీరోచిత ఉదంతం ఖ‌మ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

స‌త్తుప‌ల్లి నుంచి ప్ర‌యాణీకులతో వ‌స్తుండ‌గా ఒక్కసారిగా అతనికి గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో తుది శ్వాస విడిచే ముందు డ్రైవర్ బస్సును ప‌క్క‌కు నిలిపాడు. అనంత‌రం చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి వెళ్లాడు. అక్క‌డ చికిత్స పొందుతూ తుదిశ్వాస‌ను విడిచాడు బ‌స్సుడ్రైవ‌ర్ శ్రీ‌నివాస్‌రావు. మృతుడు వేంసూరు మండ‌లం రామ‌న్న‌సాలెంకు చెందిన బ‌స్సుడ్రైవ‌ర్‌.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement