Friday, May 3, 2024

Medak: కోనాపూర్ లో దారుణహత్య… పెట్రోల్ పోసి మరీ…

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. రామాయంపేట మండలం కోనాపూర్ చెరువు వద్ద ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. మృతుడు జోగిపేటకు చెందిన చాకలి మల్లేశంగా గుర్తించారు.

గుర్తు తెలియని వ్యక్తులు చాకలి మల్లేశంను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement