Monday, April 29, 2024

TS : ఎల్ఆర్ఎస్‌పై కాంగ్రెస్ వైఖ‌రికి నిర‌స‌న‌గా బీఆర్ఎస్ ధ‌ర్నాలు…

ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ సర్కారు అనుసరిస్తున్న వైఖ‌రిని నిర‌సిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ధ‌ర్నాల‌కు పిలుపునిచ్చింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అమీర్‌పేటలోని మైత్రివనం దగ్గర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గబీఆర్ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సనత్ నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్‌తోపాటు కార్పొరేటర్‌లు, మాజీ కార్పొరేటర్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement