Wednesday, May 1, 2024

Breaking : ఈతకు వెళ్లి – నలుగురు చిన్నారులు మృతి

యాచారం, (ప్రభన్యూస్): యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన గొల్లగూడ గ్రామ సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ..ఆదివారం గొల్లగూడ గ్రామానికి చెందిన నలుగురు ఒకే కుటుంబానికి చెందిన విద్యార్థులు సరదాగా ఈత కోసమని వెళ్లారు. దసరా సెలవులు ఇవ్వడంతో గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఇంటి వద్ద ఉంటూ సరదాగా ఈత కోసం చెరువుకుంట వద్దకు వచ్చారు. తల్లిదండ్రులకు తెలియకుండా చెరువులో ఈత కోసం వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. వారిలో సమ్రీన్ 15 సం:లు, ఖాలెద్ 13 సం:లు, రయాన్ 10 సం:లు, ఇమ్రాన్ 9 సం:లు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement