Thursday, May 16, 2024

Breaking : కాంగ్రెస్ గూటికి – ప్రవీణ్ రెడ్డి

చిగురుమామిడి, (ప్రభన్యూస్): హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సొంత గూటికి చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన తాజాగా గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మంగళవారం రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ మహ్మద్ షబ్బీర్ అలీల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రవీణ్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో తిరిగి సొంత గూటికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన హుస్నాబాద్ ఎమ్మెలెగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement