Friday, May 3, 2024

ADB: వైద్యం వికటించి… బాలుడు మృతి

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: వైద్యం వికటించి బాలుడు మృతిచెందిన ఘటన కాగజ్ నగర్ పట్టణంలో అయాన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వైద్యం వికటించి దహెగాం మండలంలోని లగ్గం గ్రామానికి చెందిన సాకేత్ (11) 4వ తరగతి బాలుడు మృతి చెందాడు. మృతికి కారకులైన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అయాన్ ఆసుపత్రిని మూసివేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement