Monday, May 6, 2024

పుట్టిన పాపను వదిలేసిన తల్లి

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని బచ్చలిబజార్ లో గుర్తు తెలియని మహిళ ఆడశిశువును వదిలి వెళ్లింది. స్థానిక ఆశా వర్కర్ అయిన కారం లక్ష్మి ఇంటి సమీపంలో ఆ పసిపాపను శనివారం తెల్లవారుజామున వదలి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. వెంటనే పాపను స్థానిక ఆసుపత్రికి తరలించి సంబందిత అధికారులకు, పోలీస్ వారికి సమాచారం అందించారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement