Wednesday, April 24, 2024

Covid-19: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఢమాల్.. కొత్తగా 11 వేల కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కేసులు పూర్తిగా తగ్గిపోతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,499 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,05,844 కు చేరింది. దేశంలో 255 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 5,13,481కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,598 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,22,70,482కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,21,881 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.82 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,77,17,68,379 కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement