Wednesday, May 1, 2024

Boinpalli – ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి

బోయిన్‌పల్లి: సికింద్రాబాద్‌లో సిటీలోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోగల భవానీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తండ్రీ ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన బిడ్డలిద్దరికీ నిద్ర మాత్రలు ఇచ్చిన తండ్రి తాను కూడా తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను తండ్రి శ్రీకాంత్‌ చారి (42), కుమార్తెలు స్రవంతి (8), శ్రావ్య (7) గా పోలీసులు గుర్తించారు. కాగా కుటుంబసభ్యుల మధ్య ఎలాంటి తగాదాలు లేవని శ్రీకాంత్‌ చారి భార్య తెలిపింది.రాత్రి భోజనం తర్వాత అందరం మాట్లాడుకుంటూ పడుకున్నామని, తెల్లారి చూసేసరికి తన భర్త, పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారని ఆమె చెప్పింది. అదేవిధంగా తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని శ్రీకాంత్‌ చారి తల్లి జయమ్మ తెలిపింది. అయితే ఈ మధ్య శ్రీకాంత్‌ వ్యాపారం సరిగా నడవడం లేదని జయమ్మ వెల్లడించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement