Friday, April 26, 2024

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ బీజేపీ నేత ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు.

‘అయ్యా కేసీఆర్ గారు… చివరకు తన చితి తాను పేర్చుకుని, కాల్చుకునే స్థితికి రైతులు చేరుకున్నారు.. మీరు చెప్పే బంగారు తెలంగాణలో  మీ పాలనలో  నేడు రైతుల దీనస్థితి ఇది’ అంటూ  విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ట్విట్టర్ లో విమర్శించారు. కాగా, సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ కు చెందిన మల్లారెడ్డికి పునరావాస కాలనీలో కూల్చివేసిన ఇంట్లోనే చితిపేర్చుకుని దానిపైనే ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement