Thursday, April 18, 2024

సీఎం జగన్ కు రఘురామ పదో లేఖ.. విజయసాయితో నష్టమంటూ ఫిర్యాదు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుసగా పదో రోజు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ లేఖ రాశారు. గత తొమ్మిది రోజులుగా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ లేఖలో డిమాండ్ చేయగా.. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. మాన్సాస్ చైర్మ‌న్‌గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బాధ్య‌త‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. విజయసాయి రెడ్డిని కట్టడి చేయాలని లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. అశోక్‌గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. మాన్సాన్ ట్రస్టుపై హైకోర్టు తీర్పు వెల్లువడినప్పటి నుంచి వ్యక్తిగత విమర్శలు చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అదుపు చేయాలని లేఖలో రఘురామ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement