Wednesday, May 15, 2024

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హౌస్ అరెస్ట్

వరి సాగుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు నిరసనగా నేడు బీజేపీ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి చేయనున్న నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. సిద్దిపేట వ్యాప్తంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును హౌజ్ అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి లోని ఆయన నివాసంలో నిర్బంధించారు. కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా సిద్దిపేట జిల్లాలో బీజేపీ నాయకులను కూడా ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. కలెక్టర్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.

కాగా, వరిసాగుపై ఇటీవల వ్యవసాయ అధికారులు సమావేశంలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరి సీడ్ అమ్మే వాళ్ల షాపులను సీజ్ చేస్తానని, సుప్రీం కోర్ట్ నుంచి అనుమతి తెచ్చుకున్నా వదిలేదని స్పష్టం చేశారు. రైతులు యాసంగిలో వరిసాగు చేయకూడదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వం, కలెక్టర్ పై మండిపడుతున్నాయి.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement