Tuesday, April 30, 2024

ఈటలతో మరో ఉప్పెన… బీజేపీకి పెద్దిరెడ్డి హెచ్చరిక

మాజీమంత్రి ఈటల రాజేందర్, బీజేపీలో చేరుతున్నారన్న వార్తలతో ఆపార్టీ నేత మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశపై సొంత పార్టీ నేతలపైనే పెద్దిరెడ్డి తీవ్ర ఆగ్రహం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్, బీజేపీలో చేరుతున్నారన్న వార్తలతో పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటలను బీజేపీలోకి ఎలా తీసుకుంటారు? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఒక వర్గం వ్యక్తులు మాత్రమే ఈటలకు మద్దతిస్తున్నారని తెలిపారు. తనను కాదని ఈటలను పార్టీలోకి ఎలా తీసుకుంటారు ? వివేక్‌ ఫామ్‌ హౌస్‌లో చర్చలు జరిపారని, తాను గుర్తుకురాలేదా? అని నిలదీశారు. ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులు నాకు చెప్పడానికి ఏంటి బాధ అని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement