Friday, April 26, 2024

ఏడేళ్ల‌లో బీజేపీ చేసిందేమీ లేదు : క‌డియం శ్రీహ‌రి

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏడేళ్లలో కేంద్రంలోని బీజేపీ ఏం అభివృద్ధి సాధించిందలేదని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు బ్యాంకులను నాశనం చేశారని ఆరోపించారు. ప్రగతి అంటే ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమేనా అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి బడా వ్యాపారులు తీసుకున్న రుణాలను మాఫీ చేశారని పేర్కొన్నారు. కనీసం విభజన హామీలు కూడా నెరవేర్చలేకపోయినా రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏడేళ్లుగా ఏం సాధించిందని, ఎక్కడికక్కడా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు బ్యాంకులను నాశనం చేశారన్నారు. బ్యాంకుల నుంచి బడా వ్యాపారులు అడ్డగోలుగా తీసుకున్న రుణాలను మాఫీ చేశారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement