Tuesday, May 21, 2024

TS : టికెట్ ఇస్తాన‌ని చెప్పిన బిజెపి హ్యాండ్ … బాబూ మోహ‌న్…

బీజెపి పార్టీ త‌న‌కు టికెట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ నేడు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. వరంగల్ కి ఎప్పడు వచ్చిన కరుణపురం నా అడ్డా అని అన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మొదటి సారిగా కరుణపురం చర్చికి వెళ్లడం జరిగిందన్నారు. వరంగల్ కి నాకు చిన్నప్పటినుండి అనుభవం ఉందన్నారు. తాను పుట్టింది వరంగల్ లోనే అని తెలిపారు.

- Advertisement -

తాను వరంగల్ ఎంపీ అభ్యర్థి గా ప్రజా శాంతి పార్టీ నుంచే పోటీ చేస్తా అని అన్నారు. తాను వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్న‌ట్లు లీకులు ఇస్తూ చీప్ రాజకీయలు చేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పుట్టిన వరంగల్ లో శెభాష్ అనిపించుకునేలాగా ప్రజలకు సేవ చెస్తా అన్నారు.

వరంగల్ ప్రజలు త‌న‌న్ను గెలిపించాలని, మంచి చేయాలనీ ఉద్దెశంతో పోటీ చేస్తున్న అన్నారు. కేసీఆర్ లాగా కే.ఎల్. పాల్ కూడా అబద్ధాలు చెప్పరని అన్నారు. ఉచిత విద్యా, ఉచిత వైద్యం తాను గెలిచాక ఇప్పిస్తా అన్నారు. పేదవారికి అందరికీ ఉచిత పింఛన్లు అందిస్తాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement