Thursday, May 2, 2024

BJP campaign – నేటి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ల ఎన్నికల ప్రచార షెడ్యూల్

ప్రచారానికి మరో ఐదు రోజుల్లో గడువు ముగిసిపోతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాయి.. ఇందులో భాగంగానే కమలం పార్టీ జాతీయ నేతలను ఎన్నికల బరిలోకి దింపింది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి ప్రచారం నిర్వహించారు. ఇక మరోమారు వారు తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ వస్తుండగా.. మోడీ రేపటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు.

ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో బీజేపీ నిర్వహిస్తున్న సకల జనుల బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అనంతరం రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, అంబర్ పేట నియోజకవర్గాల్లో రోడ్‌ షోలలో పాల్గొంటారు.

మరోవైపు ఇవాళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం మేడ్చల్ లో బీజేపీ నిర్వహిస్తున్న సకల జనుల బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇక, సాయంత్రం కార్వాన్‌, కంటోన్‌మెంట్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement