Thursday, May 2, 2024

People’s March: భట్టి విక్రమార్క పాదయాత్ర వాయిదా

సూర్యాపేట, ప్రభ న్యూస్: సూర్యాపేట నియోజకవర్గంలో 21వ తేదీ నుండి ప్రారంభం కానున్న మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ను వాయిదా వేయడం జరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు తెలిపారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో భట్టి పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంలో తీవ్ర ఎండ వేడిమి, వడగాలుల వలన భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురికావడం వలన పాదయాత్రను వాయిదా వేశామని చెప్పారు.

తదుపరి పాదయాత్ర తేదీలపై మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, భట్టి విక్రమార్కలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని, తదనుగుణంగా త్వరలోనే సూర్యాపేట నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర నిర్వహణ తేదీలు ప్రకటిస్తామన్నారు.నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదుపరి నిర్వహించబోయే పాదయాత్రకు సంసిద్దులై ఉండాలని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement