Tuesday, May 21, 2024

ప్రారంభ‌మైన భట్టి పాద‌యాత్ర‌.. పిటిషన్స్ అందజేసిన మ‌హిళ‌లు

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి..భువనగిరి మండలం బస్వాపురం గ్రామం నుంచి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. బస్వాపురం గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలేరు పట్టణంలో ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యే గొంగిడి సునీత ఒత్తిడి మేరకు అధికారులు అర్ధరాత్రి డ్రా తీసి భారాస కార్యకర్తలకు ఇచ్చారని సమంత రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భట్టి విక్రమార్క కు వినతి పత్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement