Monday, May 6, 2024

Bhadrachalam – 48 అడుగులకు చేరిన గోదావరి – రెండో హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 9.28 గంటలకు గోదావరి 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. వరద చేరేవరకు ప్రజలు వేచి ఉండకుండా జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించి తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూమూలకు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement