Monday, April 29, 2024

ఎంపి మాలోతు క‌విత కృషితో బెల్గావి – సికింద్రాబాద్ రైలు మ‌ణుగూరు వ‌ర‌కు పొడిగింపు..

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కృషి ఫలించింది.. … మణుగూరు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెర‌వేరింది.. భేల్గావి నుండి సికింద్రాబాద్ వరకు నడిచే ఎస్ర్పెస్ రైలును మణుగూరు వరకు పొడిగించింది రైల్వే శాఖ‌.. ఈ మేర‌కు సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.. మణుగూరు ప్రజల విజ్ఞప్తి మేరకుఈ రైలును మ‌ణుగూరు వ‌ర‌కు పొడిగించాల‌ని కోరుతూ పలు మార్లు రైల్వే జెనరల్ మేనేజర్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు భారసజిల్లాఅధ్యక్షురాలు, ఎంపి మాలోతు క‌విత‌.. దీనికి స్పందించిన రైల్వే అధికారులు ఈ మేరకు భేల్గవి నుండి సికింద్రాబాద్ వరకు నడిచే రైలు ను మణుగూరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. రైలు పొడిగించేందుకు కృషి చేసిన ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎంపీ కవితకు మ‌ణుగూరు ప్ర‌జ‌లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement