Sunday, April 28, 2024

TS : నేడు బండిసంజయ్ రైతు దీక్ష

ఇవాళ బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేయనున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆయన రైతు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన‎ హామీలను అమలు చేయాలనే డిమాండ్ తో దీక్ష చేయనున్నారు.

- Advertisement -

అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడంపై బండిసంజయ్ ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారు. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలనే డిమాండ్ తో దీక్ష చేపట్టనున్నారు బండి సంజయ్. తాను చేపట్టబోతున్న దీక్షకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని ఇప్పటికే బండి సంజయ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement