Wednesday, May 1, 2024

National: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు ప్ర‌మాదం… ఐదుగురు మృతి..

ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. చిత్రకూట్‌లో ప్రయాణికులతో నిండిన ఆటో రిక్షాను వేగంగా వచ్చిన డంపర్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెంద‌గా ముగ్గురు త్రీవంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రులు జిల్లా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని అమన్‌పూర్ ప్రాంతం సమీపంలో వేగంగా వచ్చిన డంపర్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎనిమిది మందిని జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా, అందులో ఐదుగురు మరణించారని జిల్లా ఆసుపత్రి సిఎంఎస్ డాక్టర్ ఆర్‌బి లాల్ తెలిపారు. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement