Saturday, May 4, 2024

KNR: సైకత రామ మందిరాన్ని దర్శించుకున్న బండి సంజయ్..

కరీంనగర్ మహాశక్తి ఆలయ ఆవరణలో సైకత అయోధ్య రామ మందిరంను రూపొందించారు. సైకత రామ మందిరాన్ని బండి సంజయ్ దర్శించుకుని జై శ్రీరామ్ అంటూ నినదించారు. గత 500 ఏళ్లుగా యావత్ హిందూ సమాజం చిరకాల వాంఛ నెరవేరబోతున్న ఘట్టం మరికొద్ది గంటల్లోనే వచ్చిందన్నారు ఎంపీ బండి సంజయ్.

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచంలోని హిందూ సమాజమంతా ఎదురు చూస్తోందన్నారు. రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎంతో మంది దీక్షలు తీసుకున్నారని, రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేవాలయాలన్నీ ముస్తాబయ్యాయన్నారు. ఇంటింటా రామ నామ స్మరణ మారుమోగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement